కేపీహెచ్బీ కాలనీ, మే 21 : కొవిడ్ బాధితుల కోసం హోమ్ ఐసొలేషన్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం హోప్ ఫర్ లైఫ్ , దిశ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో కూకట్పల్లి జోన్లో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న హోమ్ ఐసొలేషన్ సెంటర్లను జడ్సీ మమత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ బారినపడ్డ పేదలు హోం ఐసొలేషన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వారికోసం ప్రభుత్వ భవనాల్లో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో అల్వాల్ కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, కూకట్పల్లి మూసాపేట సర్కిళ్లలో సకల సౌకర్యాలతో ఐసొలేషన్ సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ సెంటర్లలో ఉచిత భోజన వసతి, ఉచిత వైద్యం, మందులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, ప్రశాంతి, ఏఎంహెచ్వో చంద్రశేఖర్రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.