హైదరాబాద్ : వాషింగ్టన్లో జులై నెలలో నిర్వహించే ‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ సభలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వానాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంతో అమెరికాలో ని తెలుగు వారిని అందరిని ఒకేచోట కలుసుకుంటారని, ఆ సందర్భం ఓ మధురానుభూతి అన్నారు. మన, సంస్కృతిని తెలియజేసే విధంగా సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి వేడుకలు నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జులై 1, 2, 3 తేదీలలో ఆటా వేడుకలను నిర్వహించే వేడుకలకు తప్పక హాజరు కావాలని మంత్రిని ఆటా ప్రతినిధులు కోరారు.