సిటీబ్యూరో, జనవరి 14(నమస్తే తెలంగాణ): నగరవాసుల జీవన ప్రమాణాలు మరింత మెరుగయ్యేలా బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన పార్కును అందుబాటులోకి తీసుకురానుంది. సైబర్ టవర్స్ సమీపంలో దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇక్కడ ల్యాప్టాప్తో పనిచేసుకునేందుకు వీలుగా కూర్చునే సీటు, వైఫై సౌకర్యం, చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. అంతేకాకుండా విజ్ఞాన శాస్త్రాన్ని ప్రతిబింబించే అంశాలు, విభిన్నమైన ఆకృతులు, ఓపెన్ జిమ్, పిల్లలకు ప్రత్యేక ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు.
సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా ర్యాంప్లను, నడక మార్గాలను ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చిన వారు సేద తీరేలా గెజిబోలు, సొగసైన సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే ఈ పార్కును ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ఆరోగ్యమే పరమావధిగా ఏర్పాటవుతున్న థీమ్ పార్కులకు విశేష ఆదరణ లభిస్తున్నది. ఇప్పటివరకు హైదరాబాద్ వ్యాప్తంగా 12,89,337 చదరపు గజాల్లో 56 థీమ్ పార్లకు శ్రీకారం చుట్టగా.. ఇప్పటికే 20 చోట్ల స్పోర్ట్స్ పార్, తెలంగాణ స్ఫూర్తి పార్, మల్టీ జనరేషన్ పార్, ఉమెన్ థీమ్ పార్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.