ఖైరతాబాద్, నవంబర్ 29: ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం, బల్దియాపై జరిగిన దాడి విషయంలో సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ద్వారా స్వయంగా పరిశీలించగా, 48 మందితో పాటు మరో 24 మంది కలిసి మొత్తం 72 మంది పాల్గొన్నట్లు నిర్ధారించారు. పాల్గొన్న వారందరికీ నోటీసులు జారీ చేయగా, అందులో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేయగా, వివరణ ఇచ్చేందుకు సైఫాబాద్ పోలీస్స్టేషన్కు సోమవారం సాయంత్రం బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు బారులు తీరారు. 48 మంది హాజరు కాగా, అందులో 32 మంది కార్పొరేటర్లు వచ్చి తమ వివరణ ఇచ్చారు. అందులో కొందరు తాము ఆ దాడిలో లేమంటూ తప్పించుకునే ధోరణిలో మాట్లాడటం కనిపించింది. కాని, సైఫాబాద్ పోలీసులు మాత్రం అన్ని నిర్ధారించుకున్న తర్వాతే వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.
దేవర కరుణాకర్(గుడి మల్కాపూర్), జి.శంకర్ యాదవ్(బేగంబజార్), కొప్పుల నర్సింహారెడ్డి (మన్సూరాబాద్), కె.నవజీవన్ రెడ్డి (హయాత్నగర్), తోకల శ్రీనివాస్రెడ్డి (మైలార్దేవ్పల్లి), కె.మహేందర్ (మూసాపేట్), వి.గంగాధర్రెడ్డి (గచ్చిబౌలి), కె.రవికుమార్ (రామ్నగర్), వి.రాధ (ఆర్కేపురం), బి.భాగ్యలక్ష్మి (మూసారాంబాగ్), మహాలక్ష్మి (హిమాయత్నగర్), ఏ.భాగ్యలక్ష్మి (గౌలిపుర), పద్మా వెంకట్రెడ్డి (బాగ్ అంబర్పేట్), బానోతు సుజాత (హస్తినాపురం), యాకార అమృత (నల్లకుంట), డాక్టర్ బి.సురేఖ (గన్ఫౌండ్రీ), ఎం.శశికళ (మంగల్హాట్), కేతినేని సరళ (అమీర్పేట్), చీర సుచిత్ర (రాంగోపాల్పేట్), దర్శన్ బోయిని (జియాగూడ),ఆకుల శ్రీవాణి (సరూర్నగర్), కె.అరుణ (సైదాబాద్), ఉమారాణి (కాచిగూడ), బండారు శ్రీవాణి (రామంతాపూర్), జె.శ్వేత (ఐఎస్ సదన్), కె. చేతన హబ్సిగూడ), ఎం.సంగీత (అత్తాపూర్), పవన్ కుమార్ (కొత్తపేట్), లాల్ సింగ్ (గోషామహల్), వెంకటేశ్వర్ రెడ్డి (వనస్థలిపురం), ఎం.లచ్చిరెడ్డి (బీఎన్రెడ్డినగర్), బద్దం మహేశ్వర్ రెడ్డి (గడ్డిఅన్నారం), కె.దీపిక (మోండా మార్కెట్)లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.