మాదాపూర్లోని యశోద హస్పిటల్లో నిర్వహించిన పల్మోనాలజీ ఫంక్షన్ టెస్టింగ్ సమ్మిట్-2023 కార్యక్రమంలో భాగంగా ఊపిరితిత్తుల పనితీరు, వాటి సామర్థ్యాలను అంచనా వేసే ప్రపంచ స్థాయి పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ సెంటర్ను ఆదివారం ప్రారంభించారు. అనంతరం పల్మోనాలజిస్ట్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాపులో శిక్షణ అందించారు. ఈ కార్యక్రమానికి యశోద హస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి, పల్మనాలజి సీనియర్ వైద్య నిపుణులు, డాక్టర్ వి.నాగార్జున హాజరై ప్రసంగించారు. యశోద హస్పిటల్స్ ప్రస్తుతం ఊపిరితిత్తుల పనితీరును, వాటి సామర్థ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేసే అత్యాధునిక పీఎఫ్టీ(పల్మోనరీ ఫంక్షన్ టెస్టింగ్) ఓసిల్లోమెట్రీ, బాడీ బాక్స్, ఫ్లైథిస్మోగ్రఫీ వంటి అధునాతన వైద్య విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ నలు మూలల నుంచి 500 మందికి పైగా పల్మోనాలజి నిపుణులు పాల్గొన్నారు.
– మాదాపూర్, మార్చి 5