కొండాపూర్, ఏప్రిల్ 30 : సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు మంగళవారం కొండాపూర్లోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో సందడి చేశారు. సన్రైజర్స్ జట్టు అధికార భాగస్వామిగా ఉన్న రాన్ బ్రాండ్ స్టోర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జట్టు సభ్యులు హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్, టీ నటరాజన్ పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. పలువురు అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు ఇచ్చారు.