నాంపల్లి/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. సంక్షేమ పాలన అమలు చేస్తున్న టీఆర్ఎస్లో చేరేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీపడుతున్నారు. శుక్రవారం మంత్రి జగదీశ్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు.
నాంపల్లి మండలం పస్నూర్ సభలో పస్నూర్, నమానాయక్తండా, చల్లవానికుంటలకు చెందిన 350 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడ మండలం రాజపేటతండా సర్పం చ్, కాంగ్రెస్కు చెందిన నున్సావత్ సక్కుబాయి బిచ్చునాయక్ గులాబీ కండువా కప్పుకొన్నారు. సంస్థాన్నారాయణపురం మండలం జనగాంలో సీపీఐ, కాంగ్రెస్ల నుంచి 80 మంది, డాకుతండాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులు, కడపగండితండాకు చెందిన 45 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, కొర్రతండాకు చెందిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విప్ గొంగిడి సునీత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
బోటిమీది తండా ఉప సర్పంచ్, కాంగ్రెస్కు చెందిన శంకర్నాయక్, నలుగురు వార్డు సభ్యులు, 50 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరుకు చెందిన 20 మంది హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెంకు చెందిన వార్డు సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిపంగి శివలీల 30 మంది కార్యకర్తలతో కలిసి కారెక్కింది. అదే మండలం కడిలబావితండాకు చెందిన వార్డు సభ్యులు, కాంగ్రెస్కు చెందిన కాట్రోతు రాజు, కాట్రోతు శ్రీనునాయక్ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.