చిక్కడపల్లి, జనవరి 3 : పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ భరోసానిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.10,26,000 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం గురించి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గాంధీనగర్, రాంనగర్, ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్ల అధ్యక్షులు ఎం.రాకేశ్కుమార్, రావులపాటి మోజస్, నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, సోమసుందర్, ముఠా నరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్గుప్త, మారిశెట్టి నర్సింగ్రావు, ఆర్.వివేక్, రవిశంకర్గుప్తా, శంకర్ ముదిరాజ్, పి.ఎస్ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, బత్తుల కిరణ్కుమార్, సీహెచ్ హన్మంతు, ఎం.వి.జనార్దన్, ఎం.బి.కృష్ణ, శ్రీధర్రెడ్డి, విఠల్, భాస్కర్రెడ్డి, కల్యాణ్ నాయక్, మల్లేశ్ యాదవ్, వెంకటేశ్, జహంగీర్, సురేశ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.