బంజారాహిల్స్,ఆగస్టు 19: రానున్న ఎన్నికల్లో అర్హులైన వారందరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద ‘ ఐ ఓట్ ఫర్ ష్యూర్’ పేరుతో 5కే రన్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ , సర్కిల్-18డీఎంసీ ప్రశాంతి ఈ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వెంకటేష్ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. పోలిం గ్ రోజున తమ ఓటు ఉందా అని చూసుకుని ఆందోళన చెందకుండా ముందుగానే ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘ ం వెబ్సైట్ యాప్ ద్వారా ఓటర్ జాబితాలో పేరుందా అనే అంశాన్ని పరిశీలించుకోవచ్చన్నారు. అక్టోబర్ 31లోగా 18 ఏళ్లు నిండబోతున్న వారంతా ఓటర్గా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 18 ఈఈ విజయ్కుమార్తో పాటు పలువురు వాకర్లు, యువతీ యువకులు పాల్గొన్నారు.