సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, హోటళ్లలో రోజు తినే ఆహార పదార్థాల్లో కల్తీ జరుగకుండా పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ వ్యాన్ను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యతను, స్వచ్ఛతను నిగ్గుతేల్చే పరీక్షను మేయర్ పరిశీలించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ… ఈట్ రైట్లో భాగంగా రోజు తినే ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలపై, కల్తీ నివారణకు జీహెచ్ఎంసీ అన్ని సరిళ్లలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంయుక్తంగా ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా తనిఖీలు చేపట్టి ఎప్పటికప్పుడు వారిపై తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. వారికి మొదట అవగాహన కల్పించి తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారని మేయర్ పేర్కొన్నారు.
30 సరిళ్లలో ప్రతిరోజు ఒక సరిల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎఫ్ఎస్ఓలు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో భాగంగా మొదట వీధి వ్యాపారులకు అవగాహన, టెస్టింగ్, ట్రైనింగ్ కల్పించాలని పేర్కొన్నారు. ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల విషయంలో అనుమానాలు ఉంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040-21111111 ను సంప్రదించాలని మేయర్ సూచించారు. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే అమ్మాలని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు.
ఆహార కల్తీ ఎకువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల పై దృష్టి సారించాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బాలాజీ మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేర మొబైల్ ల్యాబ్ వాహనాలను రాష్ట్రానికి 5 కేటాయించారని హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు సుదర్శన్ రెడ్డి, మూర్తి రాజు, ఎఫ్ఎస్ఓలు ప్రీతి, శృతి పాల్గొన్నారు.
ఈ మొబైల్ వ్యాన్లో డిజిటల్ బ్యాలెన్స్, డిజిటల్ మల్టీ పారా మీటర్, హ్యాండ్ మిల్లీ మీటర్, డిజిటల్ రీఫ్యాక్టో మీటర్ పోర్టబుల్, హాట్ ప్లేట్, హాట్ ఎయిర్ ఓవెన్, రాపిడ్ మిల్ స్రీనింగ్ ఉపకరణాలు, మిక్సర్ గ్రైండర్ వంటి పరికరాలు ఉంటాయి. ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాప్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు. స్ట్రీట్ వెండర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటళ్లు, రెస్టారెంట్లలోని రకరకాల ఆహార పదార్థాలపై సరిల్ వారీగా తనిఖీలు చేపడతారు.
నగరవాసులకు నాణ్యమైన ఆహారం అందడమే లక్ష్యంగా వినూత్న కార్యాచరణ అమలు చేస్తున్నది బల్దియా. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో విక్రయించే ఆహార పదార్థాలు నాణ్యమైనవా కాదా అని నిగ్గు తేల్చేందుకు సంచార ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్ను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆహార కల్తీపై అనుమానాలుంటే టోల్ ఫ్రీ నం. 040-21111111ను సంప్రదించాలని ఆమె సూచించారు.
సంచార ప్రయోగశాల వాహనాన్ని ప్రతిరోజూ ఓ సర్కిల్లో తిప్పుతారు. వీధి వ్యాపారులు, ఫాస్ట్ ఫుడ్ సెంట ర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వాడుతున్న నూనెలు, టమాటో సాస్, పచ్చళ్లు, టీ పౌడర్ ఇలా వివిధ రకాల ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలు చేస్తారు. నమూనాలు సేకరించి.. అక్కడికక్కడే పరీక్షించి.. నాణ్యతను తేలుస్తారు. తేడా ఉన్నట్లు గుర్తిస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.