గోల్నాక, నవంబర్ 18 : ఆడబిడ్టలకు అండగా ఉం టూ వారి పెండిళ్లకు అక్షరాల రూ. లక్షా నూట పదహారు అందించి వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఆదుకుంటున్నాడని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల తాసీల్దార్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాసీల్దార్ సీహెచ్. లలిత, కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి తదితరులతో కలసి 74 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన దాదాపు రూ.74.7లక్షల విలువగల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ అధికారి బీవీ. మహేశ్రాజు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగుడు కన్నీరు పెట్టుకుంటూ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చలించి పోయారు. దివ్వాంగుడు తన కాళ్లపై తాను నిలిచేలా అప్పటికప్పుడు రూ. 22వేలు తన స్వంత ఖర్చులతో కుట్టు మిషన్ కొనుగోలు చేయించి అందజేసి ఎమ్మెల్యే తన ఉదారత చాటుకున్నారు. అంతేగాక అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంబర్పేట డివిజన్ పటేల్బాడాకు చెందిన దివ్వాంగుడు అబీబ్నూర్ ఖాన్ (65) శుక్రవారం గోల్నాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. టైలర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న తనకు కరోనా సంక్షోభం అనంతరం ఎవ్వరూ పని ఇవ్వడంలేదని తెలిపాడు. తనకు నెలకు వస్తున్న దివ్యాంగుల పింఛన్ రూ.3వేల తోనే తన కుటుంబాన్ని నెట్టుకువస్తున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏదైనా సహాయం చేయాలని వేడుకున్నాడు. దివ్యాంగుడి మాటలకు చెలించిన ఎమ్మెల్యే రూ.22 వేల స్వంత ఖర్చుతో అప్పటికప్పుడు కుట్టుమిషన్ కొనుగోలు చేయించి అతనికి అందజేశారు. టైలర్గా పని చేస్తూ ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.