వెంగళరావునగర్, నవంబర్ 18 : సీఎం కేసీఆర్ మరో అంబేద్కర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్కు చెందిన రెండో విడత దళిత బంధు లబ్ధిదారులతో వెస్ట్ శ్రీనివాస్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని..ఆ ఖ్యాతి కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. సమ సమాజ స్థాపన కోసం కేసీఆర్ పాటుపడ్తున్నారని..ఆనాడు అంబేద్కర్ దళితుల కోసం పనిచేశారని..అదే బాటలో కేసీఆర్ నడుస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్థికంగా దళితులు నిలదొక్కుకునేందుకు దళితబంధును ప్రభుత్వం ప్రవేశం పెట్టిందని ..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంకా పథకాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా తమ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తమకు దళిత బంధు పథకం ద్వారా జీవనోపాధిని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య విజయ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేశ్,నాయకులు వేణుగోపాల్ యాదవ్, విజయ్ ముదిరాజ్, , గజ్జల బాలకృష్ణ, పవన్,సత్యనారాయణ, నర్సింగ్రావు, కిట్టు, అఫ్సర్, విజయ్,తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, నవంబర్ 18 : ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్గూడ డివిజన్ లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల స్వావలంబన కోసం..వారి సాధికారత కోసం ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. డివిజన్కు చెందిన 17 మంది లబ్ధిదారులకు రూ.1,701లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజకుమార్ పటేల్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్,నవంబర్ 18: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం వహాబ్, మేనేజర్లు రాజేందర్, రమేశ్, శ్రీనివాస్తో పాటు కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్కుమార్ పటేల్, మన్నె కవితారెడ్డిలతో ఆయా డివిజన్లలో పెండింగ్ పనులను గురించి ఆరా తీశారు. మురుగు సమస్యల పరిష్కారానికి మంజూరైన సీవరేజీలైన్ పనులను వేగంగా పూర్తిచేయాలని, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే మాగంటి ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నిధులు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు సంజీవ్, సంతోష్, మన్సూర్, కృష్ణమోహన్, విజయ్కుమార్, విజయసింహ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.