దుండిగల్,నవంబర్18: పేదల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో 20వ డివిజన్ ఇందిరానగర్లో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఎనిమిది గుడిసెలు(రేకుల) దగ్ధమయ్యాయి. శుక్రవారం బాధితులను వారు పరామర్శించారు. ఎమ్మెల్యే వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం బాధితులను ఓదార్చి ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్నీలా గోపాల్రెడ్డి,డిప్యూటీ మేయర్ ధన్రాజు,కార్పొరేటర్లు బాలాజీ నాయక్, చిట్ల దివాకర్,కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్సలీం,సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొలన్గోపాల్రెడ్డి,రవికాం త్,జ గన్,దూసకంటి వెంకటేశ్, సందీప్, సురేశ్, హరియానాయక్, పరమేశ్, రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
జీడిమెట్ల, నవంబర్18: పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. చింతల్ డివిజన్ భగత్సింగ్నగర్కు చెందిన అంజమ్మ ఇంటి పైకప్పు గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్ శుక్రవారం భగత్సింగ్నగర్కు చేరుకుని అంజమ్మకు తనవంతు సహాయంగా రూ.50 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణానికి కృషి చేసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) భగత్సింగ్నగర్ ప్రెసిడెంట్ సామ్రాట్, నాయకులు ఉప్పలయ్య, లక్ష్మణ్, ప్రభాకర్, అశోక్, జిల్లా వెంకటేశ్, పంగరాజు, రవదరాజు, సుభాశ్, చందు, శ్రీధర్గౌడ్, బస్వరాజు, భీసు వెంకటేశ్గౌడ్, జాంగీర్, రాఘవేంద్ర, అభిలాశ్, లక్ష్మమ్మ, నరసమ్మ, సుబ్బమ్మ ఉన్నారు.
గాజులరామారం,నవంబర్18: గాజులరామారం డివిజన్ పరిధిలో రూ.15.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సదుపాయాలను క ల్పించడంతో పాటు రాబోయే రోజుల్లో సమస్యలు లేని ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాజులరామారం సర్కిల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.