చర్లపల్లి, నవంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, టీఎస్ఐఐసీ కాలనీలోని సహస్ర లింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం కార్తిక మాసం సందర్భంగా నిర్వహించిన శిపపార్వతుల కల్యాణంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి పనులు చేపట్టామని, దశలవారీగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టీఎస్ఐఐసీ కాలనీలోని సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చా రు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్రెడ్డి, కుమారస్వామి, నా యకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, బేతాల బాలరాజు, ఏనుగు సీతరా మిరెడ్డి, రామచంద్రగౌడ్, జనార్దన్, పద్మారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు రమాదేవి, గొల్ల పద్మ, జ్ఞానేశ్వర్, కందాడి సుదర్శన్రెడ్డి, సత్యనారాయణ, కాసం వెం కటహరి, వెంకటకృష్ణారెడ్డి, వెంకటేశ్, కోటేశ్వర్రావు, సురేశ్ పంతులు, యాదగిరితో పాటు కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.