సిటీబ్యూరో, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఎక్కడికక్కడే నియంత్రిస్తూ, బోగస్ ఓటర్లను పట్టుకొని విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, జవాబుదారీతనం ప్రదర్శించిన సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అభినందించారు. తమ దృష్టికి వచ్చిన సంఘటనలపై తక్షణమే స్పందించి మూడు ఘటనల్లో వెంటనే చర్యలు తీసుకున్న సిబ్బందిని బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు పిలిపించి వారిని అభినందించారు.