చార్మినార్, డిసెంబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. చార్మినార్ పోలీసు స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. పీఎస్లో రికార్డులు పరిశీలించిన సీపీ.. స్టేషన్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పీఎస్ పరిధిలోని మార్కెట్ ప్రాంతాల్లో నేరాలు అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
మదీనా, పత్తర్ఘట్టి తదితర ప్రాంతాల్లోని మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపార కొనుగోళ్ల కోసం వచ్చి వెళ్లేవారితో పాటు స్థానికంగా ఉన్న వారి భద్రతకు పెద్దపీట వేయాలని సీపీ ఆదేశించారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగించేలా ఎవరు యత్నించినా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
శాంతి భద్రతలకు ప్రజలు సహకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రౌడీషీటర్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎస్ను సందర్శించిన వారిలో సీపీ శ్రీనివాస్రెడ్డితో పాటు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ షేక్ జహంగీర్, ఏసీపీ రుద్ర భాస్కర్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.