సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రై కమిషనరేట్ల సీపీలు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్ హెచ్చరించారు. ఒక వైపు కరోనా చైన్ బ్రేక్ చేసేందుకు లాక్డౌన్ ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తూనే.. మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి చలాన్లు జారీ చేస్తున్నారు. మూడు రోజుల్లో లాక్డౌన్ సడలింపు.. లాక్డౌన్ సమయాల్లో నిబంధనలు పాటించని దాదాపు 19వేల మందికి చలాన్లు జారీ చేయడంతోపాటు కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనదారులపై విపత్తు నివారణ చట్టంతో పాటు ఐపీసీ 188, మిగతా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ చలాన్లు చెల్లించకుండా అలాగే రోడ్లపై తిరుగుతూ.. రెండోసారి పోలీసులకు పట్టుబడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తున్నారు.
మాస్కు సరిగ్గా ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, గుంపులు గుంపులుగా చేరడం, లాక్డౌన్ ఉల్లంఘనలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం/ధూమపానం చేయడం