Numaish | హైదరాబాద్లో బుధవారం (జనవరి 1న ) ప్రారంభం కావాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ( నుమాయిష్) వాయిదా పడింది. మాజీ ప్రధాని సంతాప దినాల నేపథ్యంలో నుమాయిష్ రెండు రోజుల పాటు వాయిదా పడింది. జనవరి 3వ తేదీన నుమాయిష్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది నుమాయిష్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీన ఈ నుమాయిష్ ప్రారంభమై.. 46 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగాల్సి ఉంది.
పారిశ్రామిక ప్రదర్శనకు గాను దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు గాను నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించగా ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు గాను అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి.
పారిశ్రామిక ప్రదర్శనకు గాను దాదాపు 2500 స్టాళ్ల నిర్మాణం చేసేందుకు గాను నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతో పాటు స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకుంది. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించగా ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు గాను అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి.