ఖైరతాబాద్, మే 6: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి రైతులపై అవగాహన లేదని, రైతులను గురించి మాట్లాడటం విడ్డూరమ ని ఎమ్మెల్యే దానం నాగేందర్ అ న్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎ మ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం అవుతున్నాయని, ఒక నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు రావడం లేదన్నా రు. అవాకులు, చెవాకులు పట్టించుకోవద్దని, కేవలం అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినట్టు తెలిపారు. యాసంగి పంట విషయంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమం చేస్తుంటే రాహుల్ గాంధీ కనీసం మద్దతు కూడా చెప్పలేదన్నారు.