ముషీరాబాద్, డిసెంబర్ 12 : బస్తీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్లో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఎన్నో ఏండ్లుగా అంజయ్యనగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న వరదనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పనులు మొదలు పెట్టామని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయాల నిధులు వెచ్చించి దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, వర్క్ ఇన్స్పెక్టర్ శివ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, సురేందర్, రవియాదవ్, మాధవ్, శ్యామ్సుందర్, ఎ.శ్రీనివాస్, అబ్బు, శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం అడిక్మెట్ డివిజన్ సత్యానగర్ కమ్యూనిటీహాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్-15 యూసీడీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు దివ్యాంగులను సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ యూసీడీ ప్రాజెక్టు ఆఫీసర్ సుధాకర్రావు, అధికారులు మంజుల, మధు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, సురేందర్, మాధవ్, రవియాదవ్, అనురాధ, శ్రీనివాస్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.