తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, చౌరస్తాలు, స్కూళ్లు, కాలేజీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉప్పల్, కాప్రా సర్కిళ్ల కార్యాలయాలు, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కాప్రా తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ ఎస్తేరు అనిత, నాచారంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, చిలుకానగర్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ జెండాలను ఆవిష్కరించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో సర్కిల్ డీసీ శంకర్, కార్పొరేటర్లు స్వర్ణరాజు, శిరీషా సోమశేఖర్ రెడ్డి, ప్రభుదాస్, శాంతి సాయిజెన్ శేఖర్, మాజీ కార్పొరేటర్లు ధన్పాల్రెడ్డి, కొత్త రామారావు, శ్రీనివాస్రెడ్డి, ఏఎంఓహెచ్ స్వప్నారెడ్డి, ఈఈ హరిలాల్, ఏసీపీ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
– ఉప్పల్జోన్ బృందం, సెప్టెంబర్ 17
కాప్రా సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయగీతాన్ని ఆలపిస్తున్న ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, డీసీ శంకర్, కార్పొరేటర్లు స్వర్ణరాజు, శిరీషా, ప్రభుదాస్, శాంతి, తదితరులు
రామంతాపూర్లో..
నాచారంలో జెండాను ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్