సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి ఉమ్మడి పాస్ను వెంటనే ప్రవేశపెట్టాలని మెట్రో, ఆర్టీసీ యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఆదివారం మెట్రో కారిడార్లో పర్యటించిన ఆయన… పెండింగ్ మార్గాలు, మెట్రో సేవల విస్తరణ, ఆర్టీసీ-మెట్రో శాఖల మధ్య సమన్వయంపై అధికారులు బేగంపేట్లోని మెట్రో భవన్లో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఓల్డ్ సిటీ మెట్రో పనుల పురోగతి, టెండర్ల ప్రక్రియను ఆరా తీశారు. ఈ క్రమంలో తక్షణమే నగరంలో మెట్రో-ఆర్టీసీ బస్ పాస్ అమలులోకి తీసుకువచ్చేందుకు ఇరు విభాగాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో, ఆర్టీసీ, వాటర్ బోర్డు అధికారులు సమావేశంలో ఉన్నారు.