ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో ఒక హైదరాబాదీ యువకుడు భారీ ప్యాకేజ్ అందుకున్నాడు. మహమ్మద్ సాదత్ అనే యువకుడు ఏకంగా రూ.26 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నాడు. తాజాగా ఫ్లిప్కార్ట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తొలి సమస్యను కేవలం 5 నిమిషాల్లోనే సాల్వ్ చేసి కంపెనీ దృష్టి ఆకర్షించాడు. ఈ కారణంగానే అతనికి ఇంత భారీ ప్యాకేజ్ అందినట్లు సమాచారం.
2020లో ఐటీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాదత్.. ఆ తర్వాత ఒక కంపెనీలో తక్కువ జీతానికి ఉద్యోగం చేశాడు. అయితే కుటుంబ భారం మొత్తం తనే మోస్తుండటంతో ఆ ఉద్యోగంలో వచ్చే జీతం చాల్లేదు. పట్టుదలతో శ్రమించి ఫ్లిప్కార్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. అతని ప్రతిభను గుర్తించిన ఈ-కామర్స్ కంపెనీ ఏకంగా 26 ఎల్పీఏ (ఏడాదికి రూ.26 లక్షలు) ప్యాకేజీతో అతనికి ఉద్యోగం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.