హైదరాబాద్ : ఓ డాక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. దారిలో దొరికిన గోల్డ్ బ్యాగ్ను తిరిగి బాధిత వ్యక్తికి అప్పగించాడు డాక్టర్. దీంతో డాక్టర్పై పోలీసులు, బాధిత వ్యక్తి ప్రశంసలు కురిపించారు.
వివరాల్లోకి వెళ్తే.. నాచారం పరిధిలోని కార్తీకేయ నగర్కు చెందిన ధర్మేందర్ సిర్వి అనే వ్యక్తి బైక్పై సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాడు. అయితే కార్తీకేయ నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్డు వద్దకు రాగానే బైక్పై నుంచి ఓ బ్యాగు కిందపడిపోయింది. దీన్ని గమనించని ఆ వ్యక్తి.. అలానే ముందుకు వేగంగా వెళ్లాడు. బైక్ వెనుకాలే కారులో వెళ్తున్న డాక్టర్ సంగీత్ కుమార్ గమనించాడు. తక్షణమే కారును ఆపి ఆ బ్యాగును తీసుకున్నాడు. బ్యాగును ఆ వ్యక్తికి అప్పగించేందుకు డాక్టర్ ప్రయత్నించాడు. కానీ బైక్ను కారు అందుకోలేకపోయింది. దీంతో బ్యాగును నాచారం పోలీసులకు అప్పగించారు.
అందులో బంగారు నగలు ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అడ్రస్ను పోలీసులు గుర్తించారు. అనంతరం బాధిత వ్యక్తిని పోలీసుస్టేషన్కు పిలిపించి డాక్టర్ సంగీత్ కుమార్ సమక్షంలో బంగారు నగల బ్యాగును అప్పగించారు. దీంతో డాక్టర్కు ధర్మేందర్ సిర్వి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.