కేపీహెచ్బీ కాలనీ, మార్చి 8 : మహిళా సాధికరతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సమాజంలో పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్లు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్లు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను చాటిన మహిళలను సన్మానించి మెమెంటోలను అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.5.60 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 18 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, శిరీషాబాబురావు, మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, అనితాశ్రీపాల్, కృష్ణారెడ్డి, సాయిబాబా, రాజేశ్, భవానీ, రవిచంద్రకళ, భారతి తదితరులు ఉన్నారు.
విద్యతోనే అభివృద్ధి ..
చదువుతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమవుతుందని జిల్లా విద్యాధికారి విజయకుమారి అన్నారు. మంగళవారం కూకట్పల్లి ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, హెచ్ఎం నరేందర్ రెడ్డి, రవీందర్ రాజు, అయ్యన్న, ఉపాధ్యాయులు ఉన్నారు.
పారిశుధ్య కార్మికులకు సన్మానం..
వసంతనగర్ (ఐడీపీఎల్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను, సొసైటీ మహిళా డైరెక్టర్ రజిని, స్టాఫ్ జ్యోతిలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నాగేశ్వర్రావు, రాణాప్రతాప్, చంద్రారెడ్డి పాల్గొన్నారు.
పొదుపు సంఘాలకు చెక్కులు
మహిళలకు ఆత్మగౌరవం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓల్డ్బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్సీ నవీన్కుమార్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మహిళాదినోత్సవంలో పాల్గొని ప్రతిభ కనబరిచిన మహిళలకు జ్ఞాపికలు అందజేశారు.
పొదుపు గ్రూపు మహిళా సంఘాలకు రూ. 1కోటి 59లక్షల 90వేల చెక్కును మహిళలకు వారు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరికి చీరలు పంపిణీ చేసి భోజనాలు పెట్టారు. అదేవిధంగా ఫతేనగర్ భగత్సింగ్పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కార్పొరేటర్ సతీశ్గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొదుపు గ్రూపు మహిళా సంఘాలకు రూ.4.97 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక పురోగతి సాధించడం కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. పురుషులతో పాటు మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల సామాజిక, ఆర్థిక వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నరేందర్గౌడ్, మందడి సుధాకర్రెడ్డి, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, మక్కల నర్సింగ్, కర్రె జంగయ్య, బుర్రి యాదగిరి, నర్సింగ్రావు, మట్టి శ్రీను, పోచయ్య, ఖదీర్, ఉదయరాణి, సరోజ, కర్రె లావణ్య, రాజేశ్వరి, లలిత, దుర్గ హాజరయ్యారు.