కవాడిగూడ, ఏప్రిల్ 11: నగర నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియం నేడు అక్రమ పార్కింగ్లు, డంపింగ్ యార్డుగా మారింది. ఈ స్టేడియానికి ప్రతిరోజూ వందలాది మంది యువకులు, మహిళలు వచ్చి వ్యాయామం చేస్తారు. అంతేగా క నిరుద్యోగులు ప్రత్యేక శిక్షణ కూడా ఈ స్టేడియంలోనే తీసుకుంటారు. ఇలాంటి స్టేడియాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్టేడియంను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీనికి తోడు సేట్డియం చుట్టూ ఉన్న గేట్లు కూడా విరిగిపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాహనాలను ఇక్కడే అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
స్టేడియాన్ని శుభ్రం చేయిస్తాం..
స్టేడియాన్ని శుభ్రం చేయిస్తాం. గతం లో జీహెచ్ఎంసీ పర్యవేక్షణ ఉండేది. ఇప్పుడు టూరీజం విభాగం పరిధిలో సాగుతున్నది. స్టేడియానికి గేట్లు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అక్రమ పార్కింగ్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ మైత్రేయి, ఏఎంహెచ్ఓ