గౌతంనగర్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు సునీతారాముయాదవ్, ప్రేమ్కుమార్, జితేంద్రనాథ్ పూలే విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరం ముందుకు పోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, మేకల రాముయాదవ్, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మల్కాజిగిరి నియోజకవర్గం అధికార ప్రతినిధి సతీశ్కుమార్, రాందాస్ సంతోశ్, మోహన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు ఫూలేకు ఘన నివాళి
మహాత్మాజ్యోతిరావు ఫూలే చిరస్మరణీయుడని అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి సీఎల్ యాదగిరి అ న్నారు. ఆదివారం అల్వాల్ లో ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యం లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించా రు. రాజయ్య, యాదయ్య, శంకర్, యాదగిరి, పెద్ద యా దగిరి, రాజు, సీఎల్ కృష్ణ, శంకర్, సురేశ్, జంగం శేఖర్, వెంకట్, కిరణ్, ఢిల్లీ పరమేశ్, బషీరుద్దీన్ పాల్గొన్నారు.