మారనున్న గ్రామాల రూపురేఖలు
పీవోటీ రైతులను ఆదుకుంటాం: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు, మార్చి 20: కందుకూరులో ఫార్మాసిటీ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామంలో రూ.3.50కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టుదలతో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారని.. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ కృషితో ఫార్మాసిటీ ఏర్పడే గ్రామాలకు రూ.10కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఘననీయంగా అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే రూ.70కోట్లు చెల్లించారని మరో రూ.100కోట్లు రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పరామర్శ..
కొత్తగూడ సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాయిచెట్టు యాదయ్య తల్లి లక్ష్మమ్మ శనివారం అనార్యోగంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం యాదయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అదే విధంగా పెద్దమ్మ తండాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణానాయక్, ఆయన సోదరుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు లచ్చానాయక్ తండ్రి టీక్యా నాయక్ దశదిన ఖర్మలో పాల్గొన్నారు.
రూ.1.10కోట్ల పనులకు శంకుస్థాపన
మహేశ్వరం, మర్చి 20: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మహేశ్వరం 7వ వార్డు, రామచంద్రగూడ గ్రామాల్లో మిషన్భగీరథ వాటర్ ట్యాంక్, సంపుల నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి రూ.1కోటి 10 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ గ్రామాలకు అధిక నిధులను మంజూరు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, సహకారబ్యాంక్ చైర్మన్ మంచె పాండుయాదవ్, వైస్చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూన యాదయ్య, మండల రైతుబంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, మార్చి 20: రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆకులమైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మన రాష్ట్రం రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని.. రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో కూడా రైతుల కల్లాల వద్దకు వెళ్లి ధాన్యాన్ని కోనుగోలు చేసినట్లు చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని రెండు పంటలు వరి, గోదుమలను కొంటున్న మోదీ సర్కార్ తెలంగాణలో ఒక్క పంటనే కొనుగోలు చేస్తుందని తెలిపారు. పంజాబ్లో కొనుగోలు చేసిన మదిరిగా తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.