దుండిగల్, మార్చి 14: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల కో సం ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్ సెం టర్ ఆధ్వర్యంలో డిజైన్ థింకింగ్పై రెండు రోజుల వర్క్షాప్ను నిర్వహించారు. 50 మంది విద్యార్థులు వర్క్షాప్లో పాల్గొని వివిధ రకాల నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ, తమ కళాశాలలో చదివే వి ద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ (ఐవోటీ) 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీనివాసరావు, ఐసీ హెడ్ డా.మహేంద్ర, డా.వి.రాధికాదేవి, ప్రొ.బి.మాధురి పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియామాలు పాటించాలి..
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని ఎంఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి అన్నారు. మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలోని రోడ్డు సేప్టీ విభాగం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సోమవారం దుండిగల్లో రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అనంతరం సుమారు 400 వాహనాలకు రోడ్డు భద్రతను సూచించే స్టిక్కర్లను అతికించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.శ్రీనివాసరావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఉదయరంజన్ తదితరులు పాల్గొన్నారు.