వనస్థలిపురం, మార్చి 14: అత్యాధునిక సౌకర్యాలతో రూ.5కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను త్వరలో ప్రారంభిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయనగర్లోని స్విమ్మింగ్పూల్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనస్థలిపురం ఫేజ్-4 కాలనీలో మరో స్విమ్మింగ్పూల్ను నిర్మించడం జరిగిందన్నారు. గ్రేటర్లో 11 ఉండగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 2ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరో రెండు స్విమ్మింగ్పూళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. స్విమ్మింగ్ పూల్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చి దిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బీఎన్రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్గౌడ్, సామ బుచ్చిరెడ్డి, గంగం శివశంకర్, రాంబాబు పాల్గొన్నారు.