బేగంపేట్ ఫిబ్రవరి 26: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులకు ప్లాన్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ట్యాబ్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.6,289 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. 7,8,9 తరగతులకు చెందిన 111 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించిన ప్లాన్ ఇండియా సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి, డిప్యూటీ డీఈవో సురేశ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి. ప్లాన్ ఇండియా ప్రోగ్రాం ఆఫీసర్ తుషార్కాంతిదాస్, కస్తూరి,కుమారి, సుమన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.