కాచిగూడ,ఫిబ్రవరి 22: నియోజకవర్గంలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కాచిగూడ డివిజన్లోని మసీద్ఈ అజీమియా,లెజెండ్ అపార్ట్మెంట్ లైన్లో రూ.19 లక్షలు, అదే విధంగా డివిజన్లోని చెప్పల్బజార్లో రూ.12 లక్షలతో చేపడుతున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ ఉమాదేవితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం బస్తీలో ఎమ్మెల్యే కాలేరు పర్యటించి తాగునీటి, డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని బస్తీ, కాలనీల్లో సీసీ రోడ్లను వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తె లిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చ ర్యలు తప్పవని కాంట్రాక్టర్ను హెచ్చరించారు.
అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రధానంగా వేధిస్తున్న నీటి కాలుష్య సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. మాజీ ఫ్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర భీష్మదేవ్,కన్నె రమేశ్యాదవ్, సునీల్బిడ్లాన్, డాక్టర్ శిరీషయాదవ్, ఓం ప్రకాశ్యాదవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్,రవీందర్యాదవ్, కృష్ణాగౌడ్, డీఈ సువర్ణ, ఏఈ ప్రేరణ, సంపత్, జలమండలి డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ భావన, వెంకటరమణారెడ్డి, తిరుపతి నాయక్,దాత్రిక్ నాగేందర్బాబ్జి, సంతోశ్కుమార్,రమాదేవి, బబ్లూ, విజితారెడ్డి, సుభాశ్పటేల్,మల్లికార్జున్, శ్రీకాంత్యాదవ్ పాల్గొన్నారు.