సామాజిక సేవా కార్యక్రమాల్లో సికింద్రాబాద్ వైఎంసీఏ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం అని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. సికింద్రాబాద్ వైఎంసీఏను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైఎంసీఏ అధ్యక్షుడు జయకర్ డేనియల్, ప్రధాన కార్యదర్శి లెనార్డ్ మైరన్లు వైఎంసీఏ చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీనివాసరావుకు వివరించారు. కరోనా సమయంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. విద్య, వైద్యం, సామాజిక సేవల్లో మరింత ముందుకెళ్లాలని, దానికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన వెల్లడించారు. వైఎంసీఏ చేపట్టే కార్యక్రమాల్లో తప్పక తన భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. – మారేడ్పల్లి, డిసెంబర్ 18