సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ప్రతినిధుల బృందంతో టీహబ్లో యూకే బీ2బీ స్టార్టప్ కార్పొరేట్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అంశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించే అంశంపై చర్చించారు. టీ హబ్ నెట్వర్క్ ద్వారా ఇండియన్ మార్కెట్లో యూకేకు చెందిన స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశాలను ప్రతినిధుల బృందం పరిశీలించిదని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.
టీహబ్లో హెల్త్ టెక్ ఎకోసిస్టం
అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో టీహబ్లో హెల్త్ టెక్ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేశారు. హెల్త్కేర్ విభాగంలో స్టార్టప్లకు ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నీతి అయోగ్ కలిసి పని చేస్తోంది. వైద్య రంగానికి సంబంధించి రెగ్యులేటరీ, క్లీనికల్ వాలిడేషన్ మెంటర్షిప్, వైద్య రంగంలోని ప్రముఖ సంస్థలతో కలిసి పని చేసేందుకు అవకాశాలను స్టార్టప్లకు కల్పిస్తారు. ఏఐసీ హెల్త్కేర్ కోహర్ట్-3 పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఔత్సాహిక హెల్త్ కేర్ స్టార్టప్ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 30 నవంబర్ వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని, 9 డిసెంబర్ నుంచి కార్యక్రమం ప్రారంభవుతుంది. వచ్చే ఏడాది మార్చి 17వ తేదీన డెమో డేతో పాటు ప్రదర్శన, కార్యక్రమం ముగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.