చర్లపల్లి, నవంబర్ 17 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్, కమలానగర్లోని అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం జరిగిన మండల పూజ మహోత్సవానికి ఆయన హాజరై ..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ముఖ్యంగా ఆలయాలకు నిధులు కేటాయిం చి అభివృద్ధి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అ నంతరం ఎమ్మెల్యేకు, అయ్యప్ప మాలధారులకు ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, శ్రీ అయ్య ప్ప సేవా సంఘం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు విజ యం, కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు సేతు మాధవన్, కోశాధికారి కామంత్, స్వాములు జ్యోతిర్మాయిచారి, గడ్డమీది బాల్రాజు, లక్కిడి బాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కాసం వెంకటహరి, టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ఏనుగు సీతారామి రెడ్డి, మంజుల, బాజీబాషా, మొగులయ్య, వినోద్, లవణం ఉపేందర్తో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, స్వాములు పాల్గొన్నారు.