మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 17 : అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సిఫార్స్ చేసిన రుణాలను బ్యాంకులు త్వరగా మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని, లీడ్ బ్యాంకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రుణాలు అందించాలని పేర్కొ న్నారు. నగదు రహిత ఖాతాలు(డిజిటల్ పేమెంట్స్)కు సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల తరగతులు, జిల్లా పరిశ్రమలకు సంబంధించి బ్యాంకులు నిధులు విడుదల చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్ కుమార్, ఆర్బీఐ రాజేంద్రప్రసాద్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఓ రాజేంద్రప్రసాద్, జడ్పీ సీఈఓ దేవ సహాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పద్మజారాణి, షెడ్యూల్డ్ కులాల అధికారి బాలాజీ, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఝాన్సీరాణి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ రవీందర్, వ్యవసాయాధికారి మేరీరేఖ,కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకు ల అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.