మాదాపూర్, నవంబర్ 15: నానాటికీ విస్తరిస్తున్న నిర్మాణ రంగంతో పాటు కచ్చితమైన సర్వేకు సాంకేతిక తోడ్పాటును అందిస్తున్నట్లు హెక్జాగాన్ ఇండియా అధ్యక్షుడు ప్రమోద్ కౌషిక్ పేర్కొన్నారు. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఆయా రంగాలలో మరింత వృద్ధి నమోదవుతుందని ఆయన తెలిపారు. హైటెక్స్లోని నోవాటెల్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ‘టిల్ట్ కాంపెన్సేటేడ్ టోటల్ స్టేటస్ పోల్ సొల్యూషన్-ఏపీ 20’ ఆటోపోల్ను మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రమోద్ కౌషిక్తో పాటు మార్కెటింగ్ ప్రతినిధి మనోజ్ శర్మ, సేల్స్ డైరెక్టర్ పంకజ్ గుప్త, పరేశ్ త్రివేదిలు మాట్లాడుతూ.. దేశంలో నిర్మాణ రంగం అతి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థల సర్వే సహా నిర్మాణాల నిమిత్తం ఆర్టిటెక్చర్లపై తీవ్ర వత్తిడి నెలకొంటున్నదన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన పరిజ్ఞానం ద్వారా సులభమైన రీతిలో కచ్చితమైన సర్వే , ప్లాన్ల రూపకల్పన సాధ్యమై సమయం ఆదా అవుతుందని వారు పేర్కొన్నారు.