కాచిగూడ,నవంబర్ 3: ఆర్టీసీని బలోపేతం చేయడంలో సంస్థ ఉద్యోగులు, కార్మికులు గుండెకాయ లాంటివారని, గతంలో నష్టాలో ఉన్న సంస్థను ప్రస్తుతం వారి సహాకారంతో సంస్థకు ఆదాయం వస్తున్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని గ్రాండ్ హెల్త్ చాలెంజ్ అనే కార్యక్రమాన్ని కాచిగూడ బస్ టర్మినల్లో ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు.
నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోలోని వేల మందికి ఈ హెల్త్ చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యాల కోసం సంస్థ రూ.2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ ఇ.యాదగిరి, హైదరాబాద్ రీజినల్ మేనేజర్ కె.రాజేంద్రప్రసాద్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు విజయభాను, శ్యామల, అసిస్టెంట్ మేనేజర్ నమృత,సూపరింటెండెంట్ (ఫైనాన్స్)బి.యాదగిరి, డాక్టర్లు శైలజ, కృష్ణమూర్తి, శ్రీనివాస్, రూపుల కవిత, జి.రవీందర్తో పాల్గొన్నారు.