బడంగ్పేట, అక్టోబర్ 26: బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువులను ప్రణాళిక బద్ధ్దంగా సుందరీకరణ చేయడానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. దీంతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులను మహార్ద్దశ రానుంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చందన చెరువును రూ.5 కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి చేశారు. చెరువు కట్టపై మహానీయుల విగ్రహాలు, బతుకమ్మ ఘాట్, బుద్ద విగ్రహం, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేశారు. మధ్యలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. మంత్రాల చెరువు సుందరీకరణకు ఇప్పటికే రూ.2.50 కోట్లతో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. చెరువు చుట్టు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
మీర్పేట పెద్ద చెరువుకు ఇప్పటికే రూ.4 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నారు. జల్పల్లి పెద్ద చెరువు రూ.4 కోట్లతో ప్రస్తుతం సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. చెరువులోకి మురుగు నీరు రాకుండా ప్రత్యేక నాలా ఏర్పాటు చేస్తున్నారు. అల్మాస్గూడలో ఉన్న పోచమ్మ కుంట రూ. 1 కోటి, కోమటికుంటకు రూ. 1 కోటి కేటాయించి పను లు చేస్తున్నారు. ప్రస్తుతం సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే చెరువులను సుందరీకరణ చేసి ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా తీర్చిదిద్దడానికి అధికారులు సిద్ధం ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే చందన చెరువు సుందరీకరణ పూర్తి కావడంతో నిత్యం వందల మంది చెరువు కట్టపై సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలో దశల వారీగా అన్ని చెరువులను సుందరీకరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని మంత్రి సబితా ఇటీవలే అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. గతం లో చెరువుల సుందరీకరణకు రూ.11ఓట్లతో సుందరీకరణపనులు చేపట్టగా, ప్రస్తుతం రూ.8 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిధులతో చెరువుల సుందరీకరణ పనులు పూర్తి కావడానికి అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అల్మాస్గూడలోని కోమటికుంటకు రూ.2.50, అల్మాస్గూడ పోచమ్మకుంటకు రూ.2 కోట్లు, మల్లాపూర్లోని సుద్దమోనికుంటకు రూ.2కోట్లు, గుర్రంగూడలోని ఇక్కమోని కుంటకు రూ.50 లక్షలు, కుర్మల్ గూడ రూ.1 కోటి రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులను సుందరీకరణ చేయడంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది. ఇప్పటికే కొన్ని చెరువులు సుందరీకరణ చేయగా మరికొన్ని చెరువుల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. చిన్నారుల పార్కులు, ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. చెరువు కట్టలపై తెలంగాణ తల్లి, బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు.
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న అన్ని చెరువులను భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి చేయబోతు న్నాం. దశల వారీగా సుందరీకరణ చేయడానికి కృషి చేస్తున్నాం. అనుకున్నదానికన్నా అధిక నిధులు చెరువుల అభివృద్ధికి కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక బద్ధంగా చెరువులను అభివృద్ధి చేయబోతున్నామన్నారు. చెరువులను సుందరీకరణ చేయాలన్నది తన చిరకాల కోరిక అన్నారు.
బాలాపూర్ మండలంలో ఉన్న గొలుసు కట్టు చెరువులను మన పూర్వీకులు అందించిన గొప్పవరం అన్నారు. అలాం టి చెరువులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. అల్మాస్గూడ, గుర్రంగూడ, మల్లాపూర్లో ఉన్న చెరువులను సుందరీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి