అంబర్పేట, సెప్టెంబర్ 2 : అంబర్పేట చుట్టుపక్కల ప్రాంతాల వారు వినాయకులను దగ్గరల్లోనే నిమజ్జనం చేసేలా జీహెచ్ఎంసీ అధికారులు నీటి కొలనులను ఏర్పాటు చేశా రు. స్థానిక అలీకేఫ్ చౌరస్తా డంపింగ్ యార్డు వద్ద మూడు నీటి కొలనులను సిద్ధం చేశారు. మట్టి వినాయకులైతే మూడు ఫీట్లు, పీఓపీ వినాయకులైతే ఆరు ఫీట్లు ఉన్నవి ఈ కొలనుల్లో నిమజ్జనం చే యవచ్చని అధికారు లు చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయా రు చేసిన వినాయకులను హుస్సేన్సాగర్, ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేయొద్దనే కోర్టు తీ ర్పుకు అనుగుణంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. చుట్టు ఇనుప రాడ్లు పెట్టి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి అందులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ఇప్పటికే వీటిని సిద్ధం చేసి ఉంచారు. అంబర్పేట చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు వినాయకులను ఇక్కడ నిమజ్జనం చేయవచ్చు. ఈ నీటి కొలనులను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ వేణుగోపాల్, మలక్పేట ఏసీపీ వెంకటరమణ తదితరులు పరిశీలించారు. నిమజ్జనానికి సిద్ధం చేసినట్లుని పేర్కొన్నారు.