సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం మరో ఆధ్యాత్మిక ఉత్సవానికి సిద్ధమవుతున్నది. అతి పెద్ద ఆధ్యాత్మిక, సాంసృతిక ఉత్సవమైన వినాయక చవితి పండుగకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివా స్ యాదవ్ వెల్లడించారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్స్పల్ సెక్రెటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కు మార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీ ఎండీ రఘుమారెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి చెందిన నిరంజన్రెడ్డి, ఖైరతాబాద్ గణే ష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సుదర్శన్, సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శీలం ప్రభాకర్ పాల్గొన్నారు.
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
మహా నగరంలో ప్రతి ఏటా నిర్వహిం చే ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని మంత్రి తలసాని అన్నారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంద ని వివరించారు. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం ఆరు లక్షల విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుం డా ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో బ్యారి కేడ్లను ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నామని ఆయన పేర్కొన్నారు.
నిమజ్జనానికి అదనంగా మరో 50..
విగ్రహాల నిమజ్జన నిమిత్తం నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 25 కొలనులకు అదనంగా మరో 50 పాండ్స్ను నిర్మించామని మంత్రి తలసాని తెలిపారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే రహదారులలో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రేన్లు, లైటింగ్, జనరేటర్లు, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచడం, తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రతి మండపం వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహిస్తారని మంత్రి అన్నారు. సెప్టెంబర్ 9న నిర్వహించే గణేష్ నిమజ్జనం రోజున ఎనిమిది వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన ప్రాంతాలలో ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుందని, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు మఫ్టీ, షీ టీమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తలసాని పేరొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు కూడా గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులంతా జాతీయ గీతాన్ని ఆలపించారు.