హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతిలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఫోరం(టీఎస్ఈఈఎఫ్) నేతలు శ్లాఘించారు. రాష్ట్ర విద్యుత్ రంగానికి ఆయన దిక్సూచిలా నిలిచారని కొనియాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని టీఎస్ఈఈఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధలో సీఎండీ ప్రభాకర్రావును ఘనంగా సన్మానించారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ 24 గంటల విద్యుత్తో తెలంగాణను అగ్రభాగాన నిలిపారని ప్రభాకర్రావును కీర్తించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఇటీవల విద్యుత్ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాననడం ఉద్యోగులందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని సైతం సన్మానించారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు మల్లేశం, ఈ శ్రీనివాస్, పీ సురేశ్బాబు, పీ ప్రేమ్కుమార్, చక్రవర్తి, విజయ్, కృష్ణ, సంజీవ్, శివకృష్ణప్రసాద్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.