సుల్తాన్బజార్, ఆగస్టు 16 : ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవంలోకి అడుగుపెట్టడంతో పరిశ్రమల మీద ఆధారం పెరిగిందని ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఎంసీసీఐ)చైర్మన్ నాజిముద్దీన్ ఫారూఖి అన్నారు. మంగళవారం గన్ఫౌండ్రీలోని మీడియా ప్లస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల బిజినెస్ సమ్మిట్లో 35 కంపె నీలతో రూ.200 కోట్ల బిజినెస్ ఒప్పందాలను చేసుకుందన్నారు.
మరో నెల రోజుల్లో అమెరికా, బంగ్లాదేశ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లతోనూ ఒప్పందాలను చేసుకుంటున్నట్లు ఆయన వివరించారు. రోబోటిక్ కల్చర్ సర్వసాధారణమైందని, నేటి ఈ కల్చర్పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ బిజినెస్ సమ్మిట్లో ఆర్థిక రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు 21వ శతాబ్దంలో ఆర్థిక, పారిశ్రామిక విప్లవంపై మాట్లాడారు. ప్రపంచంలోని 12 దేశాలు, దేశంలోని 18 నగరాల నుంచి ఈ సమ్మిట్కు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీసీఐ బిజినెస్ సమ్మిట్ సావనీర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ సల్మాన్, డాక్టర్ అబ్దుల్ వాసి, అక్తర్ అహ్మద్, షోయెబ్ సికిందర్, కెనడా నుంచి వచ్చిన అహ్మద్ జియావుద్దీన్ పాల్గొన్నారు.