బడంగ్పేట/పహాడీషరీఫ్/కందుకూరు, ఆగస్టు 16: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బడంగ్పేట, మీర్పేట చౌరస్తా, పహాడీషరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్హాల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మీర్పేట చౌరస్తాలో ఎల్బీనగర్, మీర్పేట పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 5వేల మంది విద్యార్థులతో జాతీయ గీతాలాపన చేశారు.
బడంగ్పేటలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో, పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో సుమారు 4వేల మందితో జెండా ఆవిష్కరణ చేసి గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ పురుషోత్తం రెడ్డి, మీర్పేట, పహాడీషరీఫ్, బాలాపూర్ ఇన్స్పెక్టర్లు సీఐ మహేందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్, బడంగ్పేట, మీర్పేట మేయర్లు చిగిరింత నర్సింహారెడ్డి, దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రంరెడ్డి, కమిషనర్లు కృష్ణమోహన్రెడ్డి, సీహెచ్ నాగేశ్, జల్పల్లి చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ సుదర్శన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై..
కందుకూరు పోలీస్స్టేషన్ సీఐ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు తాళ్ల కార్తిక్, బొక్క దీక్షిత్రెడ్డి హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై విద్యార్థులు పెద్ద పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 11గంటల 30నింషాలకు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, తాసీల్దార్ ఎస్ జ్యోతి, ఎంపీడీవో వెంకట్రాములు అధికారులు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు గీతాలాపన చేశారు. కార్యక్రమంలో కొత్తగూడ సర్పంచ్ సర్పంచ్ సాధ మల్లారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, సర్పంచ్ గంగాపురం గోపాల్రెడ్డి, ఎంపీఎచ్వో విజయలక్ష్మి, ఎంపీఎం కవిత, ఏపీవో రవీందర్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.