కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 14 : ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ లు అన్నారు. ఆదివారం వజ్రోత్సవాల్లో భాగంగా కూకట్పల్లి జోనల్ ఆఫీస్ చౌరస్తాలో జానపద కళాకారుల ప్రదర్శన వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్, జోనల్ కమిషనర్ వి.మమత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం అసువులుబాసిన మహనీయులెందరో ఉన్నారని వారందరి త్యాగాల ఫలితంగానే ప్రజలందరూ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ప్రజలందరూ ఒక్కటిగా దేశ సమైక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడాల శిరీషాబాబురావు, మందడి శ్రీనివాస్రావు, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, ముద్దం నర్సింహ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్, బాబురావు, ఉప కమిషనర్లు రవికుమార్, రవరీందర్కుమార్, ఎస్ఈ చిన్నారెడ్డి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాలు ఘనంగా జరగాలి..
స్వతంత్ర వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో వజ్రోత్సవాలపై అధికారులు, కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇంటిపై జెండా ఉండాలి..
ప్రతీ భారతీయుడి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీలోని కూకట్పల్లి రైతుబజార్లో రైతులకు, వినియోగదారులకు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కృష్ణారెడ్డి, గోర్తి రాజేశ్రాయ్, సాయిశ్రీనివాస్, పాతూరి గోపి, రాంబాబు నాయుడు, కచిన్, పెద్దిరాజు, రామ్ధన్ నాయక్, రాజావెంకట్రావ్, గోపాల్ చౌదరి, సురేందర్ రెడ్డి, కిశోర్, భవాని, భారతి, కన్నాలత, హేమ, కృష్ణకుమారి, రాజేశ్వరి, పద్మ, గంగ, విజయ, సత్యప్రసాద్, కృష్ణమూర్తి ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
కేపీహెచ్బీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోవాల సందర్భంగా తిరంగ ర్యాలీని చేపట్టారు. మొదటి రోడ్డు గాంధీ విగ్రహానికి నివాళులర్పించి ఫోరం సుజనా మాల్ రాజీవ్గాంధీ సర్కిల్ వరకు జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సత్యంశ్రీరంగం, నందికంటి శ్రీధర్, రాఘవేందర్, సంతోష్కుమార్, పట్లోళ్ల నాగిరెడ్డి, పుష్పారెడ్డి, అరవింద్ రెడ్డి, ప్రవీణ్కుమార్ తదితరులున్నారు.