బేగంపేట, ఆగస్టు 7: తీవ్రమైన నొప్పికి, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయడంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అనస్థీషియాలజిస్టులు, నొప్పి ఫిజిషియన్ల కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు వర్క్షాపు నిర్వహించారు. నొప్పి నివారణకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాలపై వైద్య నిపుణులను అప్డేట్ చేయడం, ఎవరికి అవసరమైన నొప్పి నివారణ మందులను వారికే అందజేసేలా శిక్షణ ఇవ్వడం ఈ వర్క్షాపు ముఖ్య ఉద్దేశమని కిమ్స్ వైద్యులు తెలిపారు.
అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ నరేశ్కుమార్రెడ్డి, కన్సల్టెంట్ సీనియర్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ భారతి నేతృత్వంలో నొప్పి నివారణకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాలపై కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ నాగలక్ష్మి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగలక్ష్మి, ఇతర వైద్యులు మాట్లాడుతూ.. నరాల్లోని అడ్డంకులను తొలగించేందుకు అల్ట్రాసౌండ్ ఫ్లూరోస్కోపిల వాడకంపై దృష్టి పెట్టామని తెలిపారు. సాధారణ చికిత్స విఫలమైనప్పుడు.. శస్త్ర చికిత్స చేయించుకోవడం ఇష్టం లేనప్పుడు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. కిమ్స్లో ఇది నాలుగో వర్క్షాపు అని, భవిష్యత్లో ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.