సిటీబ్యూరో,ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ);స్వతంత్ర భారతావని సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ప్రతి మదిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 8 నుంచి 22 వరకు జోనల్, సర్కిల్, వార్డుల వారీగా చేయాల్సిన కార్యక్రమాలపై జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వేడుకల్లో అన్నివర్గాల వారిని మిళితం చేసేలా చర్యలు చేపట్టింది. ఈనెల 9వ తేదీన ఏకకాలంలో 20 లక్షల జాతీయ జెండాలు, 25 లక్షల స్టిక్కర్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల పతాకాలు రెపరెపలు ఆడేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. పక్షం రోజుల షెడ్యూల్ను శనివారం బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి.
వజ్రోత్సవాలు ఇలా..