కుత్బుల్లాపూర్, ఆగస్టు 3 : టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో దళా రీ వ్యవస్థకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు అం దేలా చూస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 142 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధుల కింద మంజూరైన 1 కోటి 1 లక్షా 17,500 రూపాయల విలువ చేసే చెక్కులను చింతల్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే వివిధ కాలనీల సంక్షేమ సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు ఎమ్మెల్యే బేతిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
డివిజన్, రాంరెడ్డినగర్కు చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను కలిశారు. రూ.29 కోట్ల వ్యయంతో లింకు రోడ్డు నిర్మాణానికి కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్కు చెందిన వనం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చే యాలని కోరారు.
డివిజన్, శ్రీకృష్ణానగర్ కాలనీలో పార్కు ఎంట్రెన్స్కు కృషి చేయాలని కోరుతూ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.
గ్రామానికి చెందిన గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే ను కలిసి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడంతో, త నవంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.