శేరిలింగంపల్లి, జూలై 30 : శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలో రూ.120 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగకూడదనే లక్ష్యంతో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కోటి ఇరవై లక్షల వ్యయంతో సీసీరోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం జరుగుతుందని, సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం జరుతుందన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు మారబోయిన రాజుయాదవ్, గణేశ్ ముదిరాజ్, చెన్నంరాజు, సత్యనారాయణ, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
గచ్చిబౌలి డివిజన్లోని గోపన్పల్లి గోసాయికుంట చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా అంచన వ్యయం రూ.178.54 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ నళిని, ఏఈ పావని, ఏఈ మహేందర్లతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గోపన్పల్లి తండాలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాలు సమీపంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శేరిలింగంపల్లి ప్రాంతంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరదనీటి నిల్వను తొలగించే పనులను స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ శనివారం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద నెలకొన్న పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. వరదనీటిని తొలగించేందుకు చర్యలు ముమ్మరం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఈఈ శ్రీనివాస్తోపాటు జలమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.