కీసర, జూలై 19: రైల్వే సిగ్నలింగ్, స్వదేశీ ఆటోమెటిక్ రైల్వే రక్షణ వ్యవస్థలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్ తెలిపారు. చీర్యాల్లోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, భారతీయ రైల్వే మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మార్పులకు అనుగుణంగా ప్రతిభ ఉన్న విద్యార్థులకు చక్కటి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు.
రైల్లే సంస్థ కూడా గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిసెట్ ఏడీజీ వెంకటరమణ, గీతాంజలి కళాశాల ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, ఇరిసెట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సి.కె.ప్రసాద్, అధికారులు వల్లి శ్రీ, డాక్టర్ రాధిక, శివకుమార్, డీన్ (ఐఐఐ) డాక్టర్ అనిల్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు.